Friday, October 17, 2025

42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు పోతే సహించేది లేదు... సాగర సంగం అధ్యక్షుడు శేఖర్

 

తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 వ తేదీన తెలంగాణ బిసి జేఏసీ ఇచ్చిన బంద్ కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి లోని సగర సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల  సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ బంద్ ద్వారా  బిసి ల చైతన్యం ప్రదర్శించాలని పిలునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదని అన్నారు. రాజ్యాంగ సవరణ చేసి చట్ట పరంగా నే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ, విద్య, ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగరులు బంద్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, చిలుక శ్రీనివాస్ సగర, దిండి శేఖర్ సగర, సంయుక్త కార్యదర్శి సంగిశెట్టి గంగాధర్ సగర, కార్యనిర్వాక కార్యదర్శి బంగారి ఆంజనేయులు సగర, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మోడల రవి సగర, సగర సంఘం నాయకులు కేపీ వెంకటేష్ సగర, ఖాజా సగర, రాజు సగర, కృష్ణ సగర తదితరులు పాల్గొన్నారు.

#telugunews #telangananews #bcreservation #todaynews #latesttelangananews

Reproter Raju

Wednesday, September 21, 2022

జగన్ ప్రభుత్వంపైన వల్లభనేని వంశీ ఫైర్

 


ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వివాదా ఆంధ్రప్రదేశ్ జకీయాలను హీట్ పుట్టించింది. రాత్రికి రాత్రే రాజకీయా కారణాలతో.. ఎన్టీఆర్ పేరు మార్చడం సరైంది పద్దతి కాదని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అసెంబ్లీలోనూ బయట ఆందోళలను చేపట్టారు. ఈక చివరి రోజున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన తర్వాత.. మంత్రి విడదల రజనీ బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. అయితే ఈ నిర్ణయంపై కేవలం టీడీపీ సభ్యులే కాదు.. ఇతరులు కూడా మండిపడుతున్నారు. మొన్నటి వరకు టీడీపీలో ఉండి.. ఇటీవల ఆ పార్టీకి బై బై చెప్పి.. జగన్ కు జై కొట్టిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. 

హెల్త్ యూనివిర్శిటీ కోసం ఎంతో కష్టపడిన ఎన్టీఆర్ పేరును మార్చడం సరైంది పద్దతి కాదని అభిప్రాయపడ్డారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చరిత్రాత్మక నిర్ణయం అని.. కానీ ఇలా ఉన్న యూనివర్శిటికి ఆయన పేరు తీసేయడం సరైన పద్దతి కాదన్నారు. వెంటనే ఆ పేరును కొనసాగేలా చేయాలని ఆయన వల్లభనేని వంశీ డిమాండ్ చేశారు. 

అలాగే ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పుకునే కొడాలి నాని ఈ విషయంపైన ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే లక్ష్మీ పార్వతి సైతం దీనిపై ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారనుంది. మరోవైపు ప్రభుత్వం నిర్ణయం షాక్ కు గురి చేసిందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా తాను రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించేశారు.

ఇలా వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందో లేదో చూడాలి..

మా సంస్థనుండి వచ్చిన మరెన్ని యూట్యూబ్ ఛానల్స్ లిస్ట్ 

Telugu Focus TV (Political, Cinema & More Exclusive Video only) YouTube Channel Link - https://bit.ly/3kqNrye

First Guru TV ( Devotional stories, Hinduism, Rasiphallau, etc) YouTube Channel Link - https://bit.ly/3kseCZx


Filmymoji Channel ( Comedy video only) YouTube Channel Link -

https://bit.ly/39xFW21

Piyush Reddy Vlogs ( All Vlogs Videos ) YouTube Channel Link -

https://bit.ly/3CCzbc6

Keerthana Reddy Vlogs ( All Vlogs Videos) YouTube Channel Link -

https://bit.ly/3ktNQQs

Telugu Focus TV Culture ( All Festival Videos Only) YouTube Channel Link -

https://bit.ly/39q1dL0

Telugu Focus TV Short Films - (Short Films Only ) YouTube Channel Link -

https://bit.ly/3lLo8Gr

Maa Telugu Sarigamalu ( Telugu Music Only ) YouTube Channel Link -

https://bit.ly/3Cunwf2

First Health and Beauty TV ( Health & Beauty Tips Only ) YouTube Channel Link -

https://bit.ly/2Xz8DJm

Swan Media Shorts ( Short Films) YouTube Channel Link -

https://bit.ly/3zpEdXe 

@FirstGuruTV

@TeluguFocusTV

Friday, October 1, 2021

October month Horoscope 2021 ll అక్టోబర్ నెల 12 రాశుల పూర్తి రాశి ఫలితాలు 2021

October month Horoscope 2021 ll అక్టోబర్ నెల 12 రాశుల పూర్తి రాశి ఫలితాలు 2021

ప్రతి ఒక్కరి జీవితంలో వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటుంటారు. అలా ప్రతి రోజు, లేక వారికో, నెలకో ఒక్కసారి గ్రహాల కదలిక కారణంగా పుట్టిన నక్షత్రం, లేదా రాశిని బట్టి, వారి జీవితంలో కొన్ని మార్పులు కలుగుతుంటాయి. భవిష్యత్తు గురించి తెలుసుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జీవితంలో కష్టాలను దూరం చేసుకోవచ్చు. అక్టోబర్ నెల మాస ఫలితాలు తెలుసుకోవాలంటే ..


ఈ క్రింది ఉన్న ఫోటో ని క్లిక్ చేయండి.

లేదా కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.

https://youtu.be/rTX6nX5Q3oM

Monday, June 8, 2020

కొబ్బరికాయను కొట్టడంలో కొన్ని నియమాలు...

కొబ్బరికాయను కొట్టడంలో కొన్ని నియమాలు...
పూజ చేసాక, దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది మనకు ఉన్న పద్దతి / ఆచారం. పూజ పూర్తి అయ్యాక, టెంకాయ కొట్టేసాం, నైవేద్యం పెట్టెసాం తంతు పూర్తి అయింది అని అనుకుంటారు (అనుకుంటాము). అంతా బాగనే ఉంది గాని, టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్దతి ఉంది. అందేంటొ కాస్త తెలుసుకుందాం.
టెంకాయ కొట్టడం శాంతి కారకం. అరిష్టనాశకం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవి....
(కొబ్బరికాయను కొట్టడంలో కొన్ని నియమాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి...https://www.youtube.com/watch?v=L9YL5zTunnI&t=53s )

1. భగవన్నివేదనకు కొబ్బరికాయను కొట్టబోయే ముందు దానిని స్వచ్చమైన నీటితో కడిగి, ఆ తరువాత టెంకాయ పీచు ఉన్న ప్రదేశాన్ని చేతబట్టుకుని, దేవుడిని స్మరించుకోవాలి. రాతిపై కొట్టేటప్పుడు, ఆ రాయి ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది.

2. కాయ కొట్టేటప్పుడు 9అంగుళాల ఎత్తునుండి కొట్టడం మంచిది
(జూన్ నెలలో ఈ 5 రాశుల వారకి అదృష్టం
https://www.youtube.com/watch?v=id-H5PYiP2A&t=371s
3. సరిగ్గా రెండు భాగాలుగా పగలాలి అని అంటారు. కొంచెం అటు, ఇటు ఐనా పర్లేదు. కొన్నిసార్లు టెంకాయ లోపల నల్లగా ఉంటుంది. అదేదో అశుభం అని దిగులుపడఖర్లేదు. దానివల్ల ఎలాంటి అశుభాలు జరగవు. ఆ సమయంలో “శివాయనమః” అని 108 సార్లు జపిస్తే పరిహారం అవుతుంది

4. టెంకాయ కొట్టి దానిని విడదీయకుండా చేతబుచ్చుకుని అభిషేకం చేస్తారు చాలామంది. ఆ పద్దతి తప్పు. అలా చేస్తే ఆ కాయ నైవేద్యానికి పనికిరాదు

5. కొబ్బరికాయను కొట్టి ఆ నీటిని ఒక పాత్రలోనికి తీసుకుని, కాయను వేరు చేసి వేరే ఉంచాలి. పాత్రలోని కొబ్బరినీటిని మాత్రమే అభిషేకించాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ రెండు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించాలి.

Saturday, June 6, 2020

పాంచాలరాజు రాజ్య ప్రాప్తి


 పాంచాలరాజు రాజ్య ప్రాప్తి

నారదమహర్షి అంబరీష మహారాజుతో వైశాఖమహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! వినుము. శ్రీహరికి మిక్కిలి యిష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరియొక  కథను చెప్పుదును వినుము.
(మరెన్ని భక్తి వీడియోలు చూడాలి అనుకుంటే -https://www.youtube.com/channel/UC8NNiPGjTtM3EA5w1xUDbFQ/ ఓపెన్ చేసి చూడండి)

పూర్వము పాంచాలదేశమున పురుయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచేనతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని యశ్వములు, గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరవు యేర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము, కోశము బలహీనములై గజము మ్రింగిన వెలగపండువలె సారవిహీనములయ్యెను.

( వినాయకున్ని ఎలా పూజిస్తే మన జీవితంలో ఆటంకాలు తొలిగిపోతాయో ఈ వీడియో చూసి తెలుసుకోండి. https://www.youtube.com/watch?v=nwEBxfw4vTI )

వాని బలహీనతనెరిగి వాని శత్రువులందరును కలసి దండెత్తి వచ్చిరి. యుద్దములో నోడిన రాజు భార్యయగు శిఖినితో గలసి పర్వతగుహలో దాగుకొని యేబదిమూడు సంవత్సరముల కాలము గడపెను. ఆ రాజు తనలో నిట్లు విచారించెను. "నేను ఉత్తమ వంశమున జన్మించితిని. మంచి పనులను చేసితిని. పెద్దలను గౌరవించితిని. జ్ఞానవంతుడను. దైవభక్తి, యింద్రియజయము కలవాడను. నావారును నావలెనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసితినని నాకిట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో నెంతకాలముండవలయునో కదా! అని విచారించి తన గురువులగు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులగు వారిద్దరును రాజు స్మరింపగనే వానివద్దకు వచ్చిరి.

రాజు వారిద్దరికి నమస్కరించి యధాశక్తిగను ఉపచారములను చేసెను. వారిని సుఖాసీనులగావించి దీనుడై వారి పాదములందుపడి నాకిట్టి స్థితియేల వచ్చెను? నాకు తరణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పినమాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై యిట్లనిరి. రాజా! నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత పదిజన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీయందు ధర్మప్రవృత్తి కొంచమైనను లేదు. సద్గుణము లేవియును లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవైయుంటివి. అందరిని బాధించుచు, బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశముననున్నవారికి భయంకరుడవై యుంటివి. ఇట్లు అయిదు సంవత్సరములు గడచినవి.

( చాంద్ బాయికి సాయి బాబా చూపించిన మహిమ ఏంటో చూడాలి అనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి. https://www.youtube.com/watch?v=1b7dfjuD4oo)

బాలురను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీజన్మయందును సంతానము లేకపోవుటకును నీపూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరును అప్పుడును లేకుండిరి. అందరిని పీడించుట చేతను దానమన్నది లేకపోవుటచేతను నీవు దరిద్రుడవుగా నుంటివి. అప్పుడు అందరిని భయపెట్టుటచే నీకిప్పుడు యీ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే నిప్పుడు నీ రాజ్యము శత్రువులయధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము.

నీవు గౌడదేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలోనుండగా ధనవంతులగు యిద్దరు వైశ్యులు కర్షణుడనుముని నీవున్న యడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. రెండవ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింటదాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ యడవిలో పరిగెత్తుచు, యెండకు, దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్ష్ణణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసరి వానికి సేవచేసి వానిని సేదతీర్చితివి. అతడు తేరుకున్న తరువాత నీవు మునీ! నీకు నా వలన భయములేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును. కాని పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచెనో చెప్పుము. నిన్ను విడిచెదను చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణ రక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను.

అప్పుడు నీవు  ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితిని దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసిపొమ్ము. రాజభటులు నాకై రావచ్చును కావున నేను నీవెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లనిగాలి వీచునని వానికి మోదుగ ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచటనున్నదో తెలిసికొనుటకై ఆ మునికి సేవలు చేయుటవలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయమార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖమాసమగుటచే నీవు తెలియకచేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజ వంశమున జన్మించితివి.

నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలెనని యనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖమాసము. నీవు వైశాఖశుద్ద తదియ యందు ఒకసారి యీనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతః కాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికి సుఖమును కలిగింపుము. నీవు భక్తిశ్రద్దలతో వైశాఖ వ్రతము నాచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానములను చేయుము. లోకములన్నియు నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలి పోయిరి.

రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తిశ్రద్దలతో నాచరించెను. యధాశక్తిగ దానములను చేసెను. వైశాఖవ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరును మరల వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగ తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకొని సంపదలకంటె అధికముగ సర్వసంపదలను పొందెను. వైశాఖవ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగ నుండెను. వానికి ధృష్టకీర్తి, ధృష్టకేతువు, ధృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను అయిదుగురు పుత్రులు కుమార స్వామియంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరును వైశాఖమాస వ్రత మహిమ వలన రాజానురక్తులై యుండిరి.

రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్దలతో వైశాఖవ్రతము నాచరించి యధాశక్తి దానధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చలభక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖశుద్ద తృతీయ అక్షయతృతీయనాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహువులయందు శంఖచక్రగదా ఖడ్గములను ధరించి పీతాంబర ధారియై వనమాలావిభూషితుడై లక్ష్మీదేవితో గరుడాదిపరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని జూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసికొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరచి ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గదస్వరముతో శ్రీహరిని జూచుచు ప్రభుభక్తితో ఆనందపరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను.

అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెనని నారదమహర్షి అంబరీషునితో పలికెను.
(మరెన్ని భక్తి వీడియోలు చూడాలి అనుకుంటే -https://www.youtube.com/channel/UC8NNiPGjTtM3EA5w1xUDbFQ/ ఓపెన్ చేసి చూడండి)

---సర్వే జనా సుఖినోభవంతు ---